TS EAMCET 2025
హలో ఫ్రెండ్స్…… TS EAMCET 2025 లో హాట్ సీట్ అయినా సిఎస్సి సీటు కోసం విద్యార్థుల పోటీ, కన్వీనర్ కోటాలో రాకపోతే, మేనేజర్మెంట్ సీటు కోసం ప్రయత్నాలు.
మే 11 వ తారీకున TS EAMCET 2025 యొక్క పరిక్ష ఫలితాలని విడుదల చేశారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 20, 2025 లో విడుదల చేశారు. అప్లికేషన్స్ ప్రక్రియ ఫిబ్రవరి25 నుండి ఏప్రియల్ 4వ తేదీ వరకు జరిగింది, లేట్ ఫీజులతో కలిపి ఏప్రియల్ 24వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరించారు. ఆయితే అగ్రికల్చర్, మెడికల్ కు సంబంధించి ఏప్రిల్ 29 మరియు 30 తేదీ లలో పరీక్షలు జరిగాయి, ఇంజనీరింగ్ కు సంబంధించి మే 2 నుండి 5వ తేదీ వరకు జరిగాయి.ఆయితే వీటికి సంబందించిన కౌన్సిలింగ్ లు రెండు ఫెజ్ లలో జరుగుతాయి, TS EAMCET 2025 కౌన్సిలింగ్ కు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనల విడుదల చేయలేదు.
TS EAMCET 2025 లో విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్ లో తమ కు ఏ బ్రాంచ్ లో మరియు ఏ కాలేజీలో సీటు లభిస్తుంది అని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం సిఎస్ఇ, దానికి అనుబంధ బ్రాంచీలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. కన్వీనర్ కోటాలో కంప్యూటర్ సైన్స్ సీటు రాకపోవచ్చు అని అంచనాకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మేనేజ్మెంట్ లో నైనా సిఎస్సి సీటు పొందేందుకు ఎక్కువ గా అన్వేషిస్తున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ లోనే మంచి ప్యాకేజి తో ఉద్యోగం పొందడం లేదంటే ఎంఎస్ చేసేందుకు విదేశాలకి వెళ్లాలనే ఆలోచనతో అందరూ ఈ బ్రాంచీలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు కారణం గా సాఫ్ట్వేర్ రంగంలో రిక్రూట్ మెంట్లు తగ్గుతున్నప్పటికీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సిఎస్సి సీట్ల కోసం పోటీ పడుతున్నారు. వారికి కావల్సిన బ్రాంచిలో అదే రాష్ట్రంలోని సీటు రాకపోతే ఫీజులు ఎక్కువైనా ప్రైవేట్ యూనివర్సిటీ లో చేరెందుకు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునేందుకు కూడా ఆలోచించటం లేదు. ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోట సీటు భర్తీకి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. అయినా అధికారికంగా ఒప్పందాలు జరగిపోతున్నాయి. విద్యార్థులు డిమాండ్ ను ప్రైవేటు యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నారు. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్దులకు కోరుకున్న కళాశాలలో కోరుకున్న కోర్సులో సీటు వస్తుంది మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన విద్యార్దులకు కోరుకున్న కళాశాలలో గాని లేదా కోరుకున్న కోర్సులో గాని ఏదో ఒకటి వస్తుంది. కన్వీనర్ కోట కింద సీటు రాదని భావిస్తున్నా విద్యార్థులు మేనేజ్ మెంట్ కోటాలో ఎక్కువ ఫీజులు చెల్లించిన సిఎస్సి లో చేరేందుకు ఎక్కువ గా ఆసక్తి చూపుతున్నారు.
Follow for more Daily Updates
Demand for two Phases
ఇంజనీరింగ్ లో చేరాలనుకున్న విద్యార్థులు కాలేజీల కంటే కోర్సులు కే అధికా ప్రాధాన్యత ఇస్తున్నారు. కంప్యూటర్స్ సైన్స్ ఇంజనీరింగ్ సీటు కన్వీనర్ లేదా మేనేజ్ మెంట్ రెండు కోటాల లో అధికంగా డిమాండ్ ఉంది. మేనేజ్ మెంట్ కోట తో పాటు కన్వీనర్ కోటాలోను ఈ బ్రాంచ్ లకే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. తాము కోరుకున్న కాలేజీలో తాము కోరుకున్న బ్రాంచిలో సీటు పొందటానికి విద్యార్థులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ఇప్పటికీ కళాశాలల విషయంలో కొంత మంది రాజీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. వారికి వచ్చిన ర్యాంకును బట్టి కన్వీనర్ కోటలో తాము కోరుకున్న బ్రాంచీలో సీటు రాధని భావిస్తున్నా విద్యార్థులు యాజమాన్య కోటాలో అయిన కంప్యూటర్ సైన్స్ లోనే సీటు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో TS EAMCET 2025 ద్వారా టాప్ ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోట కంప్యూటర్ సైన్స్ సీటు 12 లక్షల రూపాయల నుండి 15 రూపాయల మధ్య పలుకుతున్న కథలు సమాచారం ఉంది. మధ్యస్థంగా ఉండే కళాశాల లో 8 లక్షలు రూపాయల నుండి 10 లక్షలు మధ్యలో వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంజీనీరింగ్ నాలుగేళ్లకు ముందే ఒక ప్యాకేజీ గా మాట్లాడుకుని యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది.
Focus on Core Branches
రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కాలేజీ ల్లో సీట్ల పెంపు, కోర్సుల విలీనం లేకుండా గత విద్యా సంవత్సరంలో సీట్లే ఈసారి ఉండబోతున్నాయి. ఇంజనీరింగ్ లో ఇప్పటికే 1.10 లక్షలు సీట్లు అందుబాటులో ఉండటంతో, కొన్నేలుగా 100% భర్తీ కాకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కొత్త సీట్లు అవసరం లేదని విద్యా శాఖ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఈసారి అనుబంధ గుర్తింపు కోసం జెఎన్ టియుహెచ్ కి ఈసారి 136 ఇంజీనీరింగ్ కాలేజీలు దరఖాస్తులు చేసుకోగా అందులో సీట్ల పెంపు బ్రాంచీల విలీనానికి అనుమతి ఇవ్వలేదు. గత కొన్ని సంవత్సరాలు గా ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్స్ సైన్స్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. TS EAMCET 2025 తో పాటు జేఈఈ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల తో పాటు ఈ పరీక్షలకు హాజరైన వారి లో 70 శాంత మంది కి పైగా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఐటి మరియు వాటికి అనుబంధ కోర్సులలో చేరుతున్నారు.
దానితో కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానిక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచీ లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం భావిస్తుంది. కోర్ బ్రాంచీలను కాపాడుకోకుంటే భవిష్యత్తు లో సమతుల్యం దెబ్బ తింటుందని భావిస్తున్న ప్రభుత్వం సీట్ల పెంపుకు బ్రాంచీల విలీనానికి అనుమతి ఇవ్వడం లేదు. విద్యార్థుల నుండి డిమాండ్స్ ఉందనే కారణంతో అన్నింటినీ సిఎస్సి సంబంధిత బ్రాంచీ లుగా మార్చుకుంటూ పోవటానికి బదులు కోర్ బ్రాంచీలోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను చేర్చాలని దాని వల్ల ఆ బ్రాంచీల వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది కాగా ఇంజనీరింగ్ సీట్ల పెంపుతో పాటు కోర్సుల విలీనం పై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉందని ఇటీవలే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అవసరాలకి అనుగుణంగా ప్రభుత్వం అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటుందని వివరించింది. సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి కాలేజీలో చేసుకున్న అభ్యర్థనకు ప్రభుత్వ తిరస్కరణ సరైనదే అని తేల్చి చెప్పింది. గత ఏడాది నుంచి ప్రైవేట్ కళాశాలలో ఈ అంశం పై కోర్టును ఆశ్రయించగా, మూడవసారి హైకోర్టు లో చిక్కు ఎదురైంది.
Follow for more Daily Updates
SBI Clerk Mains Results 2025
Indian Army Jobs
SBI CBO Jobs
Important Note:
ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.