Degree Courses లో వచ్చే ఏడాది 2026 నుంచి కొత్త కోర్సులు… | Degree Courses | Latest updates

Degree Courses

    హలో ఫ్రెండ్స్……. వచ్చే సంవత్సరం నుండి కొత్తగా Degree Courses చేర్చుతున్నారు. వాటి ద్వారా ప్రభుత్వం కళాశాలలకు మంచి  రోజులు రానున్నాయి. ఉచితంగా విద్యను అభ్యసించే వారికి ఇది చక్కని ఆవకాశం.

Introduction:

    ప్రస్థుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న టెక్నాలజీ ని దృష్టి లో పెట్టుకుని, వచ్చే ఏడాది నుండి డిగ్రీ లో సరికొత్త కోర్సులు చేర్చేందుకు కొత్తగా కరిక్యులంని రూపొందించిన ఉన్నత విద్యామండలి. ఆయితే ఈ కొత్త కోర్సులు ఆల్  రెడీ బీటెక్ లో కంప్యూటర్స్ సైన్స్ విభాగం లో స్పెషలైజేషన్ పేరు తో ఉన్నాయి. ఆలాగే డిగ్రీలో కూడా కొన్ని విశ్వవిద్యాలయంలలో ఈ కోర్సులను ప్రారంభించారు. ఆయితే ఇప్పుడు ఆ సరికొత్త Degree Courses ఏమిటో చేద్దాం. వీటి  ద్వారా ఫ్యూచర్ లో టెక్నాలజీ లో కొత్త రివల్యూషన్ రాబోతుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుండి డిగ్రీలో విద్యార్థులు కూడా మైనర్ సబ్జెక్టుగా క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మరియు మిషన్ లెర్నింగ్ కోర్సులకు సంబంధించినవి చదివే ఆవకాశం ఉండనుంది. ఇంజనీరింగ్ లోనే కాదు డిగ్రీలో కూడా ఈ  కోర్సులను డిగ్రీ విద్యార్దులకు ఉద్యోగాల్లో కొత్త టెక్నాలజీలో అవకాశాలు కొరకు ఉన్నత విద్యా మండలి నిర్ణయాన్ని తీసుకుంది.

     ఆయితే ఇప్పటి వరక బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికి  మాత్రమే  అందుబాటులో ఉన్న ఈ Degree Courses ను సాధారణ డిగ్రీ విద్యార్థులకు కూడా ప్రభుత్వం అందుబాటులో కి తీసుకువస్తుంది. ఈ  మేరకు డిగ్రీలో కొత్త సిలబస్ ని తీసుకువచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చేస్తున్నా కసరత్తు చివరి దశకు వచ్చింది. 

Follow for more Daily Updates

     ఇప్పటి వరకు ఉన్న సింగల్ మేజర్ స్థానంలో డబుల్ మేజర్ విధానాన్నీ తీసుకురాబోతున్నట్లు తెలియజేసారు. ఈ విధానంలో అమలు, సిలబస్ రూపకల్పన పై ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలో ని కమిటీ నివేదికను సమర్పించింది. అయితే దీనికి సంబంధించి మండలి ఛైర్మన్ మధుమూర్తి సోమవారం నాడు విశ్వవిద్యాలయాల వైస్జ్ ఛాన్సలర్ లతో ఆన్ లైన్లో సమావేశం నిర్వహించారు. డిగ్రీ విద్యా విధానం లో తీసుకుని వస్తున్న మార్పులపై వీసీ లకు వివరించారు. వారి నుండి  సూచన్లు సలహాలు తీసుకున్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వంలో సింగల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తీసుకురాగా…. ఈ విధానానికీ వచ్చే సరికి అన్ని రకాల సబ్జెక్టు లను విద్యార్దులకు అందుబాటులో ఉంచాలంటే ఎంత మంది అధ్యపకులు అవసరం ఉన్నది అని పట్టించుకోలేదు. వాటి కారణంగా కొన్ని  ప్రభుత్వం కళాశాల లో కొన్ని సబ్జెక్టులు, మరికొన్నింటిలో వేరే వాటిని చేర్చడంతో నచ్చిన సబ్జెక్టు చదివేందుకు దూరంగా వెళ్లలేక చాలామందికి ప్రైవేట్లు కళాశాలలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఈ  విధానం లో మార్పులు చేస్తూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) సూచనల మేరకు ఉన్నత విద్యా మండలి డబుల్  మేజర్ సబ్జెక్ట్ విధానాన్నీ తీసుకొస్తోంది. 

Degree Courses

B.A& B.Com also:

డిగ్రీలో విద్యార్థులు వారికి నచ్చిన రెండు సబ్జెక్టులు ప్రధానంగా చదవాల్సి ఉంటుంది. ప్రధాన మేజర్ కు 48 క్రెడిట్లు, రెండు మేజర్ కు 32 క్రెడిట్ లు ఉంటాయి. దాదాపు రెండిటికి సమ ప్రాధాన్యం ఉంటుంది. ఫలితం గా రెండు సబ్జెక్టులను అభ్యర్థులు నేర్చుకుంటారు. ఈ రెండింటిలో ఏదో ఒక సబ్జెక్ట్ ప్రధానంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుకోవచ్చు. డబుల్ మేజర్ తో పాటు మైనర్ సబ్జెక్టులు కూడా ఉంటాయి. Degree Courses లో భాగంగా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, మరియు మేషిన్ లెర్నింగ్ ను ప్రవేశ పెడుతున్నారు. మిగిలిన ప్రోగ్రామ్స్ వారికి అని ఐచ్ఛికంగా ఉంటాయి.బిఏ, బీకాం వారు సైతం ఆసక్తిగా ఉంటే వీటిని ఎంపిక చేసుకోనే అవకాశం కూడా ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లోనూ కొత్తగా డిజైన్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ కు సంబందించిన కోర్సులను తీసుకొస్తున్నారు. ప్రస్థుతం ఉన్న ఉద్యోగ అవకాశాల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కు  ఎక్కువ  ప్రాధాన్యం ఉంది. సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం ఇలాంటి వాటిని నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగు పడతాయని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. పరిశ్రమలన్నీ ఆధునికంగా సాంకేతికతను ఉపయోగిస్తున్నందుకు విద్యార్థులకు వాటిపై అవగాహన ఉండాలనే ఉద్దేశం తో వీటిని తీసుకు వస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ  కొత్త Degree Courses, మార్పుల పై అధ్యపకులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. 

Changes in Internship:

ఇంటెన్షిప్ లో కూడా మార్పులు తీసుకుని వస్తున్నట్లు విద్యా మండలి వెల్లడించారు. 2020-21నుండి డిగ్రీలో మూడు విడుతల ఇంటెన్షిప్ ను తీసుకొచ్చారు. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత వేసవి శెలవుల్లో రెండు నెలలు పాటు కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు చేయాలి. రెండో సంవత్సరం పూర్తయ్యాక  శెలవుల్లో రెండు నెలల పాటు వారు చదువుతున్న సబ్జెక్టు పై రెండో  ఇంటెన్షిప్ చేయాలి. మూడో సంవత్సరం మూడో సంవత్సరంలో ఐదు లేదా ఆరో సెమిస్టర్ లో సెమిస్టర్ ఇంటెన్షిప్ ను తెచ్చారు.

మూడుసార్లు విడత లుగా ఉన్నాయి దీన్ని ఇప్పుడు ఒక సెమిస్టర్ కు పరిమితం చేసేలా  ప్రణాళిక ను సిద్ధం చేశారు. రెండు స్వల్పకాలిక ఇంటెన్షిప్ల వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని అధికారులకు పరిశీలనలో తెలియడం వలన కొత్త నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటితో కొత్త కరిక్యులంని తయారు చేసినట్లు ఉన్నత విద్యా మండలి  దీన్ని  ప్రభుత్వానికి సమర్పించినుంది. ఆ తర్వాతే సర్కారు ఉత్తర్వులు ఇస్తే.. వర్సిటీలు అకాడమీక్ విభాగంలో ఆమోదం తీసుకొని, అమలు చేయాల్సి ఉంటుంది.

Follow for more Daily Updates
Army Jobs
SBI CBO Jobs

 Important Note:

ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!