AP IIIT 2025 ల కి ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే.. | AP IIIT 2025 | RGUKT 2025

AP IIIT 2025

హలో ఫ్రెండ్స్… AP IIIT 2025 లో ప్రవేశాలకు ఈ సంవత్సరం మొత్తం ఎన్ని  దరఖాస్తు లు వచ్చాయంటే……..

టెన్త్ తరువాత చాలా మంది విద్యార్దులు వివిధ రకాలైన కోర్సు ల్లో జాయిన్ అవుతారు.  కొంత మంది  ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు, మరికొంత మంది  డిప్లమో కోర్సు లో జాయిన్ అవుతారు, కొంతమంది ఐటిఐ లో జాయిన్ అవుతారు. చాలా మంది టెన్త్  లో మంచి  మార్కులు సాధించిన వారు AP IIIT 2025 లలో జాయిన్  అవ్వాలని కోరుకుంటారు.

కొంతమంది ఏపీఆర్జేసీ రాసి 2 ఇయర్స్ ఇంటర్మీడియెట్ రెసిడెన్స్ యల్ కాలేజీలో MPC, BiPC వంటి కోర్సులు పూర్తి చేస్తారు. కొంతమంది పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షను రాసి వాటి ద్వారా వచ్చినా ర్యాంకు ద్వారా వివిధ రకాలైన బ్రాంచీలలో జాయిన్ అవుతారు. 

Follow Telegram for Daily Upadates

AP IIIT 2025 లలో జాయిన్ అవ్వడానికి  చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది దానికిగాను టెన్త్ లో 550 మార్కులు దాటినా ప్రతి విద్యార్ది దానికి దరఖాస్తులు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం పదవ తరగతి రిజల్ట్సు విడుదలయ్యాక, AP IIIT 2025 లకు సంబందించిన నోటిఫికేషన్  విడుదల  చేస్తారు. వీటిలో జాయిన్ అవ్వడానికి గవర్నమెంటు స్కూల్  విద్యార్దులు మరియు ప్రైవేట్ స్కూల్  విద్యార్థులు కూడా పోటీ పడతారు, కాని అందులో సీటు రావాలంటే  మెరిట్  మార్కులు ఆధారం గా ఎంపిక చేస్తారు. అందులోని గవర్నమెంటు స్కూల్   విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ని ఇస్తారు.

వారి  కంటే  ప్రైవేట్ స్కూల్  విద్యార్థుల కు మార్కులు ఎక్కువగా వచ్చిన, గవర్నమెంటు స్కూల్  విద్యార్థుల కు నాలుగు శాతం మార్కులు జోడించి వారిని మెరిట్ ఆధారం గా సెలక్ట్ చేస్తారు.

దీనికి రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. వీటిలో జాయిన్  అవ్వడానికి  దరఖాస్తు ఫీజు ఆంద్రప్రదేశ్ విద్యార్ది ఆయితే 300, ఎస్సీ  ఎస్టీ ఆంధ్రప్రదేశ్  విద్యార్థులకు 200 మరియు వేరే రాష్ట్రాల్లోని విద్యార్థుల కు 1000 రూపాయలు గా ఫీజు ఉంటుంది.

వీటిలో సీటు వచ్చినా తర్వాత వారి కి సంబందించిన వివరాలను చూసి వారి కి గవర్నమెంటు ఇఫ్ ఆంద్రప్రదేశ్ వారు ఇచ్చే రియంబర్స్మెంట్ కి అర్హులు  అవుతారు.

 

మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ లో 4 IIIT లు ఉన్నాయి. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ఉన్నాయి.వీటిని RGUKT లు  గా పిలుస్తారు.

AP IIIT 2025

Total Applications:

రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పరిధిలో ని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం మరియు ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలలో ఆరేళ్లు ఇంజీనీరింగ్ నిద్రలో ఏడాదికి ప్రదేశాలకు సంబందించిన విషయాలని సోమవారం నాడు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం వీటికి సంబంధించి 46,500 మంచి విద్యార్దులు దరఖాస్తు లు చేసుకున్నారు అని ఆర్జీయూకేటీ రిజిస్టర్, నూజివీడు క్యాంపస్ డైరెక్టర్, ప్రవేశాల కన్వీనర్ సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. వీటికి సంబంధించిన దరఖాస్తులు నమోదు గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలకు  ముగియనున్నది అని తెలిపారు. ఇక గత ఏడాది తో పోల్చుకుంటే ఈ ఏడాది 1000 తక్కువ అప్లికేషన్ లు వచ్చాయి.

ప్రతిభ ఉన్నా పేదింటి  పిల్లలకి త్రిబుల్ ఐటీల్లో ఆరేళ్లు  సాంకేతిక విద్యను ఉచితం గా అందిస్తున్నారు. పది తరగతి లో మంచి  మార్కుల తో పూర్తిగా చేసినా వారికి అప్లికేషన్స్ చేసుకోవచ్చని  ఆర్జీయూకేటీ ప్రవేశాల కన్వీనర్ సండ్ర అమరేంద్ర తెలిపారు. AP IIIT 2025 లలో ఒకసారి  ప్రవేశం పొందితే చాలు అక్కడే  ఇంటర్మీడియట్, ఇంజీనీరింగ్ విద్యా కలిపి ఆరేళ్ళు చదవాల్సి ఉంటుంది. బీసి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓసీల్లో కూడా 2,50,000 ఆదాయం లోపు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఫీజులు రియంబర్స్మెంట్ ఉందని. వారు  ఎటువంటి  ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని త్రిబుల్ ఐటి ల ప్రదేశాల కన్వీనియర్ సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. ఇంటర్ తో పాటు, నాలుగేళ్ల నాణ్యమైన ఇంజీనీరింగ్ విద్య, వసతిని విద్యార్థులు పొందవచ్చని  ఆయన  చెబుతున్నారు.

Selection Process:

అర్హతలు కలిగినా విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల యొక్క  జాబితా ను జూన్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. జూన్  11వ తేదీన నుండి సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. జూన్ 30 వ తారీకు నుండి  క్లాసులు ప్రారంభిస్తారు అని తెలిపారు.

పిహెచ్ సి, క్యాంప్, ఎన్సిసి, స్టార్ట్స్, స్కౌట్స్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేన్ నూజివీడులో త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కొక్క త్రిబుల్ ఐటీ కి 1000  చొప్పున సీట్లు ఉంటాయి మరియు అవి  కాకుండా ఈడబ్ల్యూఎస్ సీట్లు  100 ఉన్నాయి. మొత్తం మీద నాలుగు క్యాంపస్ లకు కలిపి 4400 సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్కాలర్షిప్ రాని విద్యార్దులు సంవత్సరానికి పియుసి కి 45000 రూపాయలు ఫీజు మరియు ఇంజీనీరింగ్ కు సంవత్సరానికో 50,000గా ఫీజు ని నిర్ణయించారు. తెలుగులో రాష్ట్రాల వారికి 25% సూపర్ న్యుమరి సీట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఈ అభ్యర్థులు సంవత్సరానికి ట్యూషన్ ఫీజు 1,50,000 చెల్లించాలిం చాలని తెలిపారు. పియుసి తరువాత  త్రిబుల్ ఐటీ నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం ఉంది. అప్లికేషన్ లో అభ్యర్థి మెరిట్ క్యాటగిరి వచ్చిన ప్రాధాన్య ద్వారా క్యాంపస్ కేటాయిస్తారు. ఒకేసారి క్యాంప్ కేటాయించిన తరువాత మరొక క్యాంపస్ కు మారటానికిి ఉండదు. రూల్ ఇఫ్ రిజర్వేషన్, ఎస్సీ సబ్ ప్లాన్ వర్గకరణ ప్రకారంగా సీట్ల ను భర్తీ చేస్తారు. గతంలో చాలా మంది విద్యార్దులు సీటు  దొరుకుతుందో లేదో అని అనుమానంతో వేరే కాలేజీలలో చేరి మళ్ళీ  ఇక్కడ  సీటు వచ్చినా తర్వాత అక్కడ డబ్బు లు వదులుకుని ఇక్కడికి రావడం వంటి ఇబ్బందులు పడే ప్రసక్తి ఉండదని కన్వీనియర్ అమరేంద్ర కుమార్ తెలిపారు.

Follow Telegram for Daily Upadates
Jee Advanced 2025 
AP EAMCET 2025

Important Note:

ఫ్రెండ్స్ మన website అయిన Daily Updates లో ప్రతిరోజూ ముఖ్యమైన Job and Educational Updates ఇస్తాం. కావున ప్రతి ఒక్కరు మన website ని రోజు Visit చేసి మీకు అర్హతలు ఉన్న Jobs మరియు Education కి సంబంధించిన వాటి గురించి తెలుసుకొని Apply చేసుకోండి.

 

Leave a Comment

error: Content is protected !!